క్రైమ్ మిర్రర్, అమరావతి :- అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.సీఐడీ (CID) జప్తు చేసిన ఆస్తుల వేలం ద్వారా వచ్చే డబ్బును బాధితులకు చెల్లిస్తామని ఉపసంఘం తెలిపింది. ఈ క్రమంలో ఏజెంట్ల నుంచి నెల రోజుల్లో బాండ్లను సేకరించాలని కూడా నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో దాదాపు 11.57 లక్షల మంది డిపాజిటర్ల సమస్యకు పరిష్కారం లభించనుందని సమీక్ష అనంతరం మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని బాధితులకు సుమారు రూ. 3,944 కోట్లు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కేసీఆర్పై కోపంతో రైతులను శిక్షించొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి…!