ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన పలు చిత్రాలు, సిరీస్లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో విడుదలవుతూ వినోద ప్రియులకు విభిన్న అనుభూతిని అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన కంటెంట్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రం ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఓటీటీ వేదికను షేక్ చేస్తోంది. విడుదలైన తక్కువ సమయంలోనే భారీ వ్యూయర్షిప్ సాధిస్తూ ట్రెండింగ్ జాబితాలో టాప్ స్థానంలో దూసుకుపోతోంది.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లలో ఉండే సస్పెన్స్, మిస్టరీ, ట్విస్టులు ఈ సిరీస్లో కూడా ఉన్నప్పటికీ, కథనాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండటమే దీని ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ కారణంగానే ప్రేక్షకులు ఈ సిరీస్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఐఎమ్డీబీ ప్లాట్ఫామ్లో కూడా ఈ సిరీస్కు మంచి రేటింగ్ లభించడం విశేషంగా మారింది. కథలోని ఉత్కంఠ, పాత్రల నిర్మాణం, స్క్రీన్ప్లే తీరు అన్నీ కలిపి ఈ సిరీస్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
కథ విషయానికి వస్తే ప్రముఖ రచయిత అభీక్ బారువా రాసిన ‘సిటీ ఆఫ్ డెత్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. కోల్కతా నగర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నగరంలో ఒక సైకో కిల్లర్ వరుసగా యువతులను లక్ష్యంగా చేసుకుని దారుణ హత్యలకు పాల్పడుతుంటాడు. ఈ కేసు మరింత భయానకంగా మారేది ఏమిటంటే, హంతకుడి గురించి పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరకకపోవడం. దీంతో ఈ కేసు నగర పోలీసులకు పెద్ద సవాల్గా మారుతుంది.
ఇదే సమయంలో ఒకప్పుడు అత్యంత తెలివైన, సమర్థవంతమైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందిన రీటా బ్రౌన్ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల కారణంగా విధుల నుంచి దూరంగా ఉంటుంది. అయితే సైకో కిల్లర్ దాడులు పెరుగుతుండటంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు రీటాను మళ్లీ విధుల్లోకి రప్పిస్తారు. ఆమె తన బృందంతో కలిసి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును ఛేదించేందుకు దర్యాప్తు ప్రారంభిస్తుంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి.
ఈ క్రమంలో హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి, సైకో కిల్లర్ ఎవరు, అతని లక్ష్యం ఏమిటి అన్న అంశాలు కథలో కీలక మలుపులుగా మారతాయి. చివరకు ఈ భయంకరమైన సీరియల్ కిల్లర్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ను చూడాల్సిందే.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘బ్రౌన్’. అభినయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ను జీ స్టూడియోస్ నిర్మించింది. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన ఈ సిరీస్, బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జరిగిన ‘బెర్లినాలే సిరీస్ మార్కెట్ సెలెక్ట్స్ 2023’లో ఎంపికైన ఏకైక భారతీయ వెబ్ సిరీస్గా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5 ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో ప్రేక్షకులు దీన్ని వీక్షించవచ్చు.
ALSO READ: ప్రెషర్ కుక్కర్లో ఇవి వండితే ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడ్డట్టే..?