Homeక్రైమ్Breaking: గొడ్డు మాంసం రవాణా.. పోలీసుల పై దాడి..9 మంది అరెస్ట్..!

Breaking: గొడ్డు మాంసం రవాణా.. పోలీసుల పై దాడి..9 మంది అరెస్ట్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ కొత్తపేట చౌరస్తా వద్ద మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 12 మంగళవారం తెల్లవారుజామున ఒక డీసీఎం వాహనంలో తరలిస్తున్న 8 ఎద్దులను “పశువుల వధకై” (కసాయిఖానాకు) తరలిస్తున్నారనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. అయితే, ఆ ఎద్దులను పాతబస్తీలోని పురాణీ హవేలీలో జరగబోయే ఒక సినిమా షూటింగ్ కోసం తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.

దింతో వాహనంలో ఉన్న నిర్వాహకులపై దాడి జరుగుతుండటంతో సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పశువులను సురక్షితంగా ఫతుల్లాగూడలోని గోశాలకు తరలిస్తుండగా, చైతన్యపురి యూ-టర్న్ వద్ద నిందితులు బైక్‌లపై వెెంబడించి పోలీసు వాహనాల పై రాళ్లు రువ్వారు.

ఈ రాళ్ల దాడిలో ఒక డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లకు పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు చేసి, సరూర్ నగర్ పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల రవాణాపై ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని, పుకార్లను నమ్మి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని మల్కాజ్‌గిరి కమిషనరేట్ హెచ్చరించింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు