క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు నేటి నుండి (మే 13, 2026) ప్రారంభమై మే 21, 2026 వరకు జరగనున్నాయి ఇంటర్మీడియేట్ బోర్డ్ స్పష్టం చేసింది. రోజుకు రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం (1st Year) విద్యార్థులకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం (2nd Year) విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు.
అలాగే ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.