క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ బకాయిల కోసం ₹1,000 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం అక్టోబర్ 2025 నాటి జీపీఎఫ్ బకాయిలను క్లియర్ చేసింది. గతంలో నెలకు ₹700 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹1000 కోట్లకు పెంచింది.
మిగతా ఉద్యోగుల బకాయిలను త్వరలోనే నెలకు వెయ్యి కోట్ల చొప్పున క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లో చదవవచ్చు. ఉద్యోగుల మెడికల్ బిల్లులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు.