మునుగోడు,క్రైమ్ మిర్రర్:-మునుగోడులో అంబేద్కర్ సంఘం సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఆదివారం ఎన్నికలు నిర్వహించి నియమించారు. సంఘం అధ్యక్షుడుగా పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ముచ్చపోతుల శ్రీకాంత్,ప్రధానకార్యదర్శిగ బెల్లపు బాల శివరాజు,కోశాధికారిగా ముచ్చపోతుల తరుణ్,సాంస్కృతిక కార్యదర్శి పెరుమాళ్ళ నరసింహ,ప్రచార కార్యదర్శిగా గోలి శ్రీనివాస్,క్రీడల కార్యదర్శిగా దాసరి సాయిచంద్ తోపాటు కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు. గౌరవ సభ్యులు గాదరి శరణార్థి, గోలి చెన్నకేశవులు,ముచ్చపోతుల నరసింహ, పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.నూతన అధ్యక్షుడు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యత అప్పజెప్పినందుకు ,సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ,ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.నూతనంగా ఎన్నికయిన కమిటీనీ శాలువాలతో సన్మానించారు..గోలి మారయ్య,గోలి చంద్రమౌళి,లక్క యాదగిరి,లక్క స్వామి,పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు,పోగుల దేవేందర్, కులస్తులు,అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రాకతో స్తంభించిన ఓఆర్ఆర్.. వాహనదారుల వినూత్న నిరసన!
S.A. Dharmadhikari: లా విద్యలో మనుస్మృతి, బుద్ధిజం బోధించాలి.. మద్రాస్ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు!