హైదరాబాద్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) మరియు NIUM సంయుక్తంగా అధికారిక లోగో రూపకల్పన కోసం ప్రత్యేక డిజైన్ పోటీని ప్రకటించాయి. సృజనాత్మకతను ప్రోత్సహించే ఈ పోటీలో విద్యార్థులు, గ్రాఫిక్ డిజైనర్లు ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు.
ఈ పోటీలో అత్యుత్తమ డిజైన్కు ప్రథమ బహుమతిగా రూ.20,000 అందజేయనున్నారు. ద్వితీయ స్థానం పొందిన వారికి రూ.15,000, తృతీయ స్థానం సాధించిన వారికి రూ.10,000 నగదు బహుమతులు ఇవ్వబడతాయి.
పోటీలో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 5లోపు తమ డిజైన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విజేతల పేర్లను ఆగస్టు 10న ప్రకటిస్తారు. అనంతరం ఆగస్టు 15న కొత్త లోగోను అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
పోటీకి సంబంధించిన ముఖ్య నిబంధనల ప్రకారం, కేవలం ఒరిజినల్ డిజైన్లకే అవకాశం ఉంటుంది. AI ద్వారా రూపొందించిన లేదా ఇతరుల నుంచి కాపీ చేసిన డిజైన్లను పూర్తిగా తిరస్కరిస్తారు. అభ్యర్థులు ఇచ్చిన QR కోడ్ను స్కాన్ చేసి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోటీ ద్వారా స్థానిక ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
also read: లైంగిక బాధితుల గోప్యతకు హైకోర్టు కీలక నిర్ణయం – సోషల్ మీడియా దిగ్గజాలకు కీలక ఆదేశాలు
