HomeతెలంగాణTG Yellow Alert: పగటిపూట ఎండ...సాయంత్రం ఈ వర్షాలు..!

TG Yellow Alert: పగటిపూట ఎండ…సాయంత్రం ఈ వర్షాలు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో ఏర్పడిన ద్రోణి (Trough) ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు (ఏప్రిల్ 24 వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని అధికారులు సూచించారు. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, సాయంత్రం వేళల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలిపారు.

ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 24 వరకు వర్ష సూచన ఉంది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల వడగళ్ల వర్షం (Hailstorm) కురిసే అవకాశం ఉందని IMD హైదరాబాద్ తెలిపింది.

హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు:

  1. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్.
  2. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్.
  3. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట.
  4. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు