Homeక్రైమ్అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు...!

అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ మంగళవారం, ఏప్రిల్ 7, 2026న ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఒక విత్తన కంపెనీకి లైసెన్స్ జారీ చేయడానికి మరియు వారి వ్యాపారానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటానికి గోవర్ధన్ లంచం డిమాండ్ చేశారు.

గతంలోనే బాధితుడి నుండి ₹25,000 తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. మిగిలిన ₹1,00,000 తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్ట్ అనంతరం రాజేంద్రనగర్‌లోని ఆయన కార్యాలయంతో పాటు, ఎల్బీనగర్‌లోని ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కెమికల్ టెస్టులో గోవర్ధన్ చేతి వేళ్లకు లంచం డబ్బు ఆనవాళ్లు (పాజిటివ్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు