వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే 10,000 కట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగిన అనంతరం మార్చి 30, 2026న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 బిల్లుల్లో 10 కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 10 పనిదినాల్లో మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు సభ సాగింది. బడ్జెట్ వ్యయాలకు సంబంధించి ఈ కీలక బిల్లుకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026 ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికుల సామాజిక భద్రత కోసం దీనిని రూపొందించారు.
న్యాయవాదుల రక్షణ బిల్లు 2026 న్యాయవాదుల భద్రత కోసం చట్టం చేశారు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి 15% లేదా ₹10,000 కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు ఇచ్చేలా నిబంధనలు చేర్చారు. ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లు (Hate Speech Bill) ఆన్లైన్ లేదా బహిరంగ వేదికలపై విద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ఒక బిల్లును మరింత అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. అలాగే, మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. చివరి రోజు బడ్జెట్ గ్రాంట్లపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
