Homeతెలంగాణనేడు నారాయణపేట,వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

నేడు నారాయణపేట,వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు  వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మరియు నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణాల్లో పర్యటించనున్నారు.
ఆయన సుమారు రూ. 558 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రూ. 5 వేల కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-మక్తల్-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం మక్తల్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు