Homeతెలంగాణతమిళనాడు ఎన్నికల్లో రూ.5863 కోట్ల అభ్యర్థి...!

తమిళనాడు ఎన్నికల్లో రూ.5863 కోట్ల అభ్యర్థి…!

క్రైమ్ మిర్రర్, తమిళనాడు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తున్న వారిలో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఓ మహిళ నిలవడం విశేషం. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీమా రోజ్ .. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థుల్లోకెల్లా సంపన్నురాలిగా ఉన్నారు. 58 ఏళ్ల లీమా రోజ్ తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువను రూ.5,863 కోట్లుగా చూపించారు.

వ్యక్తిగతంగా తన పేరిట ఉన్న ఆస్తుల విలువే రూ.1049 కోట్లు అని అఫిడవిట్ లో లీమా రోజ్ పేర్కొన్నారు. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత అయిన మార్టిన్ సతీమణే ఈ లీమా రోజ్. ఇటీవలే అన్నాడీఎంకేలోచేరి టికెట్ సంపాదించి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఆమె హామీల కన్నా ఆమెకు ఉన్న ఆస్తుల అంశమే తమిళనాడు ఎన్నికల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు