హైదరాబాద్,క్రైమ్మిర్రర్: సతీష్ అవ్వాల దర్శకత్వంలో దినేష్ కుమార్, దివిజా ప్రభాకర్ జంటగా రూపొందుతున్న “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రం నుంచి “ఒక్కడివే… నువ్వొక్కడివే…” అనే లిరికల్ సాంగ్ను భారత చైతన్య యువజన పార్టీ (BCY) జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ అవ్వాల మాట్లాడుతూ, తమ సినిమాలోని “ఒక్కడివే… నువ్వొక్కడివే…” పాటను విడుదల చేసిన బోడె రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: మాదాపూర్ ఎస్హెచ్వోగా కె.వి. సుబ్బారావు బాధ్యతల స్వీకరణ…!
ప్రేక్షకులను అలరించే వినోదంతో పాటు హృదయాలను తాకే భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని వెల్లడించారు. హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ, “ఒక్కడివే… నువ్వొక్కడివే…” పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ దివిజా ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. పాట విడుదల కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకులు పాశం వెంకటేశ్వర్లు గారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొని చిత్ర విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆహ్వానితులు పాల్గొని చిత్ర విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Also Read:కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు.. కుమార్తెపై తండ్రి సంచలన వ్యాఖ్యలు