ఛండీఘడ్, క్రైమ్మిర్రర్: భారత్లో తొలి పర్యావరణహిత హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ 10 కోచ్ల రైలు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ కాలుష్య రహితంగా ప్రయాణిస్తుంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్- సోనిపత్ మధ్య సేవలు అందిస్తుంది.భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన రైలు పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేస్తూ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇంజినీర్లు ఈ మోడ్రన్ రైలును రూపొందించారు. స్టీమ్, డీజిల్, విద్యుత్ రైళ్ల తర్వాత భారత రైల్వే ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలిచింది.స్వచ్ఛ ఇంధన రవాణా రంగంలో భారతీయ రైల్వే చారిత్రక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలో జెండా ఊపి రంభించారు.
Also Read:కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు.. కుమార్తెపై తండ్రి సంచలన వ్యాఖ్యలు
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ రైలు, తన ప్రయాణానికి అవసరమైన విద్యుత్ను హైడ్రోజన్ను ఉపయోగించి స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది.ఈ 10 కోచ్ల రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. 3,200 హార్స్పవర్ సామర్థ్యంతో పనిచేసే ఈ రైలు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనతతో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది.ఈ కార్యక్రమంతో పాటు హర్యానాలో రూ.12,470 కోట్లకు పైగా విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేసి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
Also Read:రెబ్బెన్ లో రక్తపాతం.. రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు దారుణ హత్య
ఇందులో భాగంగా సుమారు రూ.9,680 కోట్ల వ్యయంతో నిర్మించిన 158 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఈ గ్రీన్ఫీల్డ్ కారిడార్ వల్ల ఢిల్లీ-కత్రా ప్రయాణ సమయం 14 గంటల నుంచి 6 గంటలకు, ఢిల్లీ-అమృత్సర్ ప్రయాణ సమయం 8 నుంచి 4 గంటలకు తగ్గనుంది. ఇది వైష్ణోదేవి యాత్రికులకు, పర్యాటకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.అదేవిధంగా అంబాలా-కాలా అంబ్, జింద్-గోహానా జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేశారు. జింద్-గోహానా రహదారి వల్ల ప్రయాణ సమయం రెండు గంటల నుంచి 40 నిమిషాలకు తగ్గనుంది. హన్సీ-బరవాలా రహదారి విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.కురుక్షేత్ర నగరంలో రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిర్మించిన ఎలివేటెడ్ రైల్వే ట్రాక్ను కూడా ప్రధాని ప్రారంభించారు.
Also Read:పాఠశాల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. వృద్ధుడిపై పోక్సో కేసు
ఇది రైలు, రోడ్డు రవాణా వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతుంది.రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భివానీలోని పండిట్ నేకీ రామ్ శర్మ ప్రభుత్వ వైద్య కళాశాల, నార్నౌల్లోని మహర్షి చ్యవన్ మెడికల్ కాలేజీ, రావు తులారామ్ ఆసుపత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సంస్థల ద్వారా హర్యానాలో వైద్య విద్య, ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.వీటితో పాటు సిక్కు గురువుల చరిత్ర, వారి త్యాగాలు, దేశ సంస్కృతికి వారు అందించిన సేవలను ఆధునిక టెక్నాలజీతో ప్రదర్శించేందుకు కురుక్షేత్రలో నిర్మించనున్న సిక్కు మ్యూజియానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ హర్యానా సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.