ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమ బెంగాల్లో రికార్డులను బద్దలు కొడుతూ బీజేపీ విజయం సాధించడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. బెంగాల్ విజయం చారిత్రాత్మకమని నరేంద్ర మోడీ అన్నారు. ఇది ప్రజలకు కల్పించిన నిజమైన రోజు అని అభిప్రాయపడ్డారు.. ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. బెంగాల్లో 93 శాతం ఓటింగ్ నమోదు కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు మోదీ.
బెంగాల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రవేశించిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వా్మ్యంతో పాటు రాజ్యాంగం గెలిచిందని అన్నారు. బీజేపీ ఉన్నచోటే గుడ్ గవర్నెన్స్, అభివృద్ధి జరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు.