Homeఅంతర్జాతీయంఅమెరికాతో ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని న‌ష్టం

అమెరికాతో ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని న‌ష్టం

ఎక్స్ వేదికగా జైరామ్ రమేశ్ విమర్శలు

న్యూఢిల్లీ,క్రైం మిర్ర‌ర్‌:  అమెరికాతో భార‌త్ చేసుకున్న ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ కేంద్రాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు.

అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాల్ని తగ్గించడం వల్ల అమెరికా రైతులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక అర్థ‌మైందేందంటే ర‌ష్యా నుంచి ఇక‌పై చ‌మురు దిగుమ‌తి చేసుకోద‌నే విష‌యం స్ప‌ష్ట‌మవుతుంది.

రష్యా నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తే 25 శాతం జరిమానాను భారత్‌పై తిరిగి విధించ్చని అమెరికా ప్రకటించింది’ అని రమేష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

భారతీయ రైతులను పణంగా పెట్టి అమెరికన్ రైతులకు సహాయం చేయడానికి భారతదేశం దిగుమతి సుంకాలను తగ్గిస్తుంది. ఈ ఒప్పందంతో అమెరికా నుండి భారత్ వార్షిక దిగుమతులు మూడురెట్లు పెరుగుతాయి.

అలాగే అమెరికాకు ఎగుమతులు చేసే భారత్ వస్తువులపై గతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్‌ను చేసుకున్న కౌగిలింతలు, దిగిన ఫొటోలు పెద్దగా ఫలించలేదని విమ‌ర్శించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు