Homeక్రైమ్హైదరాబాద్‌ కోఠి లో కాల్పులు: ముగ్గురు అరెస్ట్ వారిలో ఒకరు తెలిస్తే షాక్..!

హైదరాబాద్‌ కోఠి లో కాల్పులు: ముగ్గురు అరెస్ట్ వారిలో ఒకరు తెలిస్తే షాక్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: గత జనవరి 31న హైదరాబాద్‌ కోఠి లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద రూ. 6 లక్షల నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన కేరళ వ్యాపారి రిన్షద్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో పరారైన విషయం అందరికి విధితమే. అయితే కాల్పులు, దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించి, నిందితులందరినీ అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. ఈ కేసులో ప్రధాన నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న హర్యానాలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని నేడు (ఫిబ్రవరి 24, 2026) అరెస్ట్ చేశారు అని సమాచారం.

నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన తుపాకీ మరియు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. నిందితులకు పాతబస్తీలో ఆశ్రయం కల్పించిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించి అరెస్ట్ చేశారు సమాచారం. అయితే అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు