క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్:- ఐర్లాండ్ , ఇంగ్లాండ్ దేశాలతో జరిగిన టీ20 సిరీస్లలో టీమిండియా ఎదుర్కొన్న ఓటములపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత జట్టు వరుస పరాజయాలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రధాన కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ్లాట్ పిచ్లపై అలవాటు – విదేశాల్లో తడబాటు:- ఐపీఎల్ టోర్నమెంట్లో బ్యాటింగ్కు పూర్తిగా సహకరించే ఫ్లాట్ పిచ్లపై ఆడి అలవాటు పడిన మన ఆటగాళ్లు, విదేశీ పిచ్లపై కనీస ప్రతిభను కూడా చూపలేకపోతున్నారని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. స్వదేశీ లీగ్లలో భారీ స్కోర్లు బాదే ప్లేయర్లు, విదేశాల్లో స్వింగ్ మరియు బౌన్స్తో కూడిన కఠినమైన పిచ్లు ఎదురయ్యే సరికి చేతులెత్తేస్తున్నారని విమర్శిస్తున్నారు.
బ్లైండ్గా ఆడుతూ కుప్పకూలుతున్న బ్యాటర్లు:– విదేశీ జట్ల నాణ్యమైన బౌలింగ్ను, పదునైన బంతులను ఎదుర్కొనే క్రమంలో మన బ్యాటర్లు ఎటువంటి ప్రణాళిక లేకుండా బ్లైండ్గా షాట్లు ఆడుతూ వికెట్లు పారేసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్ పరిస్థితులు, బౌలింగ్ వైవిధ్యాన్ని అంచనా వేసి ఆచితూచి ఆడటం నేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
బౌలింగ్లోనూ మార్పులు అవసరం:- కేవలం బ్యాటింగ్ విభాగమే కాకుండా, బౌలింగ్ విభాగంలోనూ కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. విదేశీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు వైవిధ్యమైన వ్యూహాలు అవసరమని నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్కు కలిసొచ్చే 7 సెంటిమెంట్…లెనిన్ తో తొలి బ్లాక్బస్టర్ అందుకుంటాడా…?