Homeతెలంగాణవ‌న్య‌ప్రాణుల‌ను కాపాడుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌తః ఎఫ్ ఆర్‌వో సుష్మ‌రావు

వ‌న్య‌ప్రాణుల‌ను కాపాడుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌తః ఎఫ్ ఆర్‌వో సుష్మ‌రావు

మంచిర్యాల‌, క్రైమ్ మిర్ర‌ర్: జ‌న్నారం మండ‌లంలోని త‌పాల్‌పూర్ పాఠ‌శాలలో సోమ‌వారం వ‌న్య‌పా్ర‌ణుల దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ఎఫ్ ఆర్‌వో సుష్మ‌రావు ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మాన‌వాళి జీవ‌వైవిద్యంతో త‌మ‌తో పాటు వ‌న్య‌ప్రాణుల‌కు జీవించే హ‌క్కు ఉంద‌ని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానోపాద్యాయులు దుంప‌ల తిరుప‌తి, ఎఫ్ెస్‌వో న‌దీమ‌, శంక‌ర్‌, చంద్రిక‌, రాజేంద‌ర్‌, రామ‌రావు లు ఉన్నారు.

తాజావార్తలు