క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్లో వాట్సాప్ తప్పనిసరి యాప్గా మారిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగ అవసరాలు.. ఇలా అన్నింటికీ వాట్సాప్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్లు, ఫేక్ లింకులు, మోసపూరిత కాల్స్ వినియోగదారులకు పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా లక్కీ డ్రా, జాబ్ ఆఫర్, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది వంటి సందేశాలతో చాలామందిని మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్పుడు యూజర్లు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లను సులభంగా నియంత్రించుకోవచ్చు. వాట్సాప్లో ఇప్పటికే సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్గా సైలెంట్ అవుతాయి. ఫోన్ రింగ్ కాకపోయినా, కాల్ వివరాలు మాత్రం కాల్ హిస్టరీలో కనిపిస్తాయి. దీంతో అవసరమైతే తర్వాత చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే స్పామ్ మెసేజ్లను తగ్గించేందుకు మరో ప్రత్యేక ఫీచర్ను కూడా వాట్సాప్ అందిస్తోంది. అనుమానాస్పదంగా ఒకేసారి ఎక్కువ మెసేజ్లు పంపే అకౌంట్లను యాప్ ఆటోమేటిక్గా గుర్తించి ఫిల్టర్ చేస్తుంది. దీంతో ఫేక్ అకౌంట్ల నుంచి వచ్చే ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.ఈ ఫీచర్లను ఉపయోగించాలంటే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ ప్రైవసీ ఆప్షన్ను ఓపెన్ చేసి సంబంధిత ఫీచర్ను ఆన్ చేయవచ్చు. అలాగే తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే ఆ చాట్ను ఓపెన్ చేయకుండానే బ్లాక్ లేదా రిపోర్ట్ చేసే సౌకర్యం కూడా ఉంది.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న ఈ రోజుల్లో వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు క్లిక్ చేయకుండా ఉండటం మంచిది. కొత్త ప్రైవసీ ఫీచర్లతో వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తోంది.