Homeక్రైమ్CRIME NEWS: కల్లు దుకాణంలో గొడవ.. ఒకరి మృతి..!

CRIME NEWS: కల్లు దుకాణంలో గొడవ.. ఒకరి మృతి..!

  • కల్లు దుకాణంలో గొడవ.. ఒకరి మృతి..

  • హైదరాబాద్‌లో రౌడీషీటర్ దాడి..

  • మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

  • భారీగా డ్రగ్స్ సీజ్…

  • పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్..

  • కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో నమోదైన మరియు వెలుగులోకి వచ్చిన ప్రధాన క్రైమ్ వార్తలు..

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య: వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత (33) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తోటి కానిస్టేబుల్ వేధింపులే తన మరణానికి కారణమని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ దాడి: మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో ఉల్లా ఖాన్ అనే రౌడీషీటర్ డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉంది.

కల్లు దుకాణంలో గొడవ.. ఒకరి మృతి: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఓ కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో దశరథ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మద్యం మత్తులో నలుగురు యువకులు అతనిపై దాడి చేసి, తలపై బండరాయితో బాదడంతో ఈ దారుణం జరిగింది.

భారీగా డ్రగ్స్ సీజ్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) చిలకలగూడ, సనత్ నగర్ మరియు ఆదిబట్ల పరిధిలో జరిపిన దాడుల్లో అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను అరెస్ట్ చేసింది. వారి నుంచి సుమారు రూ. 63.6 లక్షల విలువైన MDMA మరియు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్: మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 28న తీర్పు వెలువరించనుంది. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 7.78 లక్షల విలువైన నిల్వలను ఆహార భద్రతా అధికారులు సీజ్ చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు