HomeతెలంగాణBREAKING: ఎమ్మెల్యేల అనర్హత వేటు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..!

BREAKING: ఎమ్మెల్యేల అనర్హత వేటు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు మే 6 లోపు తమ కౌంటర్ అఫిడవిట్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు కోర్టు మూడు వారాల సమయం ఇచ్చింది. మే 6 నాటికి కౌంటర్లు రికార్డుల్లో ఉండాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.

నోటీసులు పొందిన ఎమ్మెల్యేలు: దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం. సంజయ్ కుమార్ మరియు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులు అందాయి.

పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై తుది నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు