Homeఅంతర్జాతీయం180 మంది మైనర్ బాలికలపై వేధింపులు..!

180 మంది మైనర్ బాలికలపై వేధింపులు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సుమారు 180 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి జిల్లా పరట్వాడకు చెందిన 19 ఏళ్ల మొహమ్మద్ అయాజ్ (అలియాస్ తన్వీర్). సోషల్ మీడియా (స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా బాలికలను “ప్రేమ” పేరుతో ట్రాప్ చేసి, వారిని ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లి వేధించేవాడు.

నిందితుడు దాదాపు 350కి పైగా అసభ్యకర వీడియోలను చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బాలికలను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, అధికారులు పరట్వాడలోని అతని నివాసంలో ఉన్న అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు