క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్ వద్ద ఉన్న పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ను శుభ్రపరిచే పనుల కారణంగా, మే 2వ తేదీ (శనివారం) ఉదయం 6 గంటల నుంచి మే 3వ తేదీ (ఆదివారం) ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. మరికొన్ని ప్రాంతాల్లో నీటి పీడనం తక్కువగా ఉండవచ్చని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది.
నీటి సరఫరా నిలిచిపోయే లేదా అంతరాయం కలిగే ప్రధాన ప్రాంతాలు ఇవే:
గోషామహల్ మరియు కార్వాన్ సర్కిల్ (డివిజన్-XIII): రెడ్ హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడే కి ఖబర్, హిందీ నగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్, దక్షిణ మధ్య రైల్వే (నాంపల్లి), గన్ఫౌండ్రీ.
గోల్కొండ జోన్ (డివిజన్-XIV): చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, పాత మల్లేపల్లి, ఆసిఫ్నగర్, అహ్మద్ నగర్.కవాడీగూడ సర్కిల్ (డివిజన్-XVII):కవాడీగూడ వార్డు, గాంధీనగర్ వార్డు, దోమలగూడ.
జూబ్లీహిల్స్ సర్కిల్ (డివిజన్-XV): బంజారాహిల్స్ వార్డులోని కొన్ని ప్రాంతాలు.
నీటి సరఫరా నిలిపివేత దృష్ట్యా వినియోగదారులు తమకు అవసరమైన నీటిని ముందే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. సరఫరా పునరుద్ధరించబడే వరకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.