ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కాంట్రాక్టులకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను కొద్దిసేపట్లో ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్కుమార్తో పాటు వాసుదేవరెడ్డి, రాజ్కెసిరెడ్డి తదితరులను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మద్యం రవాణా టెండర్లు, సబ్కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో భారీగా అక్రమ లాభాలు పొందినట్లు కూడా ఈడీ తన విచారణలో పేర్కొంటోంది.
దర్యాప్తులో భాగంగా సునీల్కుమార్కు సంబంధించిన పలు విలువైన వస్తువులు, లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. అలాగే కారుమూరి కుటుంబానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.
అయితే ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా, కేసుకు సంబంధించిన తదుపరి న్యాయ ప్రక్రియ కోర్టు పరిధిలో కొనసాగనుంది. అరెస్ట్ అనంతరం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: నైట్క్లబ్ ఘర్షణలో బ్రైడన్ కార్సే.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
