క్రైమ్ మిర్రర్, సినిమా:- 94 ఏళ్ల వయసులో కూడా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు తన సినిమా కలను నిజం చేసుకోవడానికి శ్రమించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారింది. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం “సింగ్ గీతం”పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మిస్తుండగా, తాజాగా జరిగిన “హలో బాసు” deleted song event ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాకు ఎంతో సేవ చేశారని, ఇప్పుడు ఆయన కోసం తాము ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. దర్శకుడిగా ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిన సింగీతం గారి కలల ప్రాజెక్ట్ ఇదని తెలిపారు.
నాగ్ అశ్విన్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, “పుష్పక విమానం” సినిమా కంటే ముందే ఈ కథను Kamal Haasan కు సింగీతం వినిపించారట. దాదాపు 40 ఏళ్ల క్రితమే ఈ కథ ఆయన మనసులో ఉందని వెల్లడించారు. ఇప్పుడు ఆ కల నిజమవుతుండటంతో సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన “హలో బాసు” పాట గురించి కూడా నాగ్ అశ్విన్ సరదాగా స్పందించారు. సంగీత దర్శకుడు Devi Sri Prasad ఎంతో కష్టపడి ఈ పాటను రూపొందించారని చెప్పారు. అయితే సినిమాలో ఆ పాటకు చోటు లేకపోవడంతో దాన్ని తొలగించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ తన కాల్స్ కూడా ఎత్తడం లేదని సరదాగా చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.
ఇక రిపోర్టర్లు “కల్కి 2” సినిమా గురించి ప్రశ్నించగా నాగ్ అశ్విన్ తెలివిగా సమాధానం తప్పించుకున్నారు. ఆ ప్రశ్న వినిపించనట్టుగా నటిస్తూ నవ్వేశారు. దీంతో అభిమానులు మాత్రం “కల్కి 2” అప్డేట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.“సింగ్ గీతం” సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు కొత్త కథతో ప్రయోగం చేయడం నిజంగా ప్రత్యేకమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.