Homeతెలంగాణవరద ముప్పులో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాల

వరద ముప్పులో దేవరకొండ ట్రైబల్ గురుకుల పాఠశాల

క్రైమ్ మిర్రర్, దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో కురుస్తున్న బారీ వర్షాలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల ప్రభావంతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతూ, తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయాయి.

ప్రత్యేకంగా కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం చుట్టూ వరద నీరు చేరడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పాఠశాల సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భవనం చుట్టూ నీరు నిలిచిపోయింది.

Also Read:పెళ్లి వేడుకలో అనూహ్య ఘటన… ఆశ్చర్యపోయిన బంధువులు

ఈ పరిస్థితుల్లో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైతే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు.

వాగు దాటే మార్గం పూర్తిగా మునిగిపోయింది. వర్షం ఇంకా కొనసాగితే ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది అని. దేవరకొండ పట్టణం, కొమ్మేపల్లి గ్రామ పరిసరాలు మొత్తం వర్షజలాలతో నిండిపోవడంతో రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.

Also Read:షాద్‌నగర్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు..!

Also read:గాయం కారణంగా ప్రతీకా అవుట్.. ఆమె ప్లేస్ లోకి కీలక ప్లేయర్?

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు