Homeతెలంగాణఅభివృద్దికోసం కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ప‌ని చేస్తుంది

అభివృద్దికోసం కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ప‌ని చేస్తుంది

  • మంత్రి కోమటిరెడ్డి

నల్గోండ, క్రైం మిర్ర‌ర్ః

రాష్ట్ర ప్ర‌జ‌ల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ క‌ట్టుబ‌డి ప‌ని చేస్తుంద‌ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నరు.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో భాగంగాఆయ‌న 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం కి మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల, సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిస్తే మ‌రింత అభివృద్ది చేసి చూపెడుతామ‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ ప్ర‌చారంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు