క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో సగటున కిలో చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు మరియు పట్టణాల వారీగా తాజా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్, ఖమ్మం:- ఈ జిల్లాల్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి రూ. 300 మధ్య పలుకుతోంది.కామారెడ్డిలో కిలో చికెన్ రూ. 280 కి విక్రయిస్తున్నారు.వరంగల్లో కాస్త తక్కువగా కిలో రూ. 270 కే లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ధరల పరిస్థితి:-విజయవాడలో కిలో చికెన్ రేటు రూ. 280 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.గుంటూరు మార్కెట్లో కిలో చికెన్ రూ. 250 నుంచి రూ. 270 వరకు అమ్ముతున్నారు.విశాఖపట్నం, అమలాపురం, భీమవరం ప్రాంతాల్లో కూడా కిలో చికెన్ ధర గరిష్టంగా రూ. 280 వరకు పలుకుతోంది.మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులోనే, పెద్దగా హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగా ఉన్నాయి. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
పల్లెల్లోనే మతిమరుపు ముప్పు ఎక్కువ: తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడి
సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు సిట్ ఏర్పాటు.!