అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. అంజన, అన్ మాథ్యూ అనే ఇద్దరు మహిళలు మృతిచెందినట్లు సమాచారం. వీరిద్దరినీ వారి స్నేహితురాలు అనిలా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి అనిలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హత్యలకు దారితీసిన అసలు కారణం ఏమిటనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి స్పందించారు. కాలిఫోర్నియాలో ఇద్దరు మహిళలు హత్యకు గురైన విషయం నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే ఈ దారుణానికి కారణాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.
మృతదేహాలను స్వస్థలమైన కేరళకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సురేశ్ గోపి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: దేశానికి 4 స్వర్ణాలు.. జీవనోపాధి కోసం కూరగాయల అమ్మకం!
