దేశ రాజధాని దిల్లీలో కలకలం రేపే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కశ్మీరీ గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి నోయిడాకు ప్రయాణిస్తున్న బాలికపై ఆగస్టు 4న బస్సులో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది. బాలిక ప్రయాణించిన బస్సు, ఘటన జరిగిన పరిస్థితులు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు అత్యంత సున్నితంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కేసులో పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: చదువు రావడం లేదని విద్యార్థి బలవన్మరణం….! ఆ ప్రాంతంలో విషాదం
