యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఎలిజాల ఉమేష్ అనే యువకుడు బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అనంతరం బాలికను చింతలగడ్డ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు సమాచారం.
బాలికను గుర్తించిన బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనపై యువకుడు బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.
ఈ నెల 28న ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
