Homeక్రైమ్హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ

హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ మాదిగ

దళిత యువకుడు రాజేష్‌ను పోలీసులు ఆకారణంగా హత్య చేశారు

హైదరాబాద్‌, క్రైమ్ మిర్రర్: దళిత యువకుడు రాజేష్‌ను పోలీసులు ఆకారణంగా హత్య చేశారంటూ ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోలీస్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాల్సిందే అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కేసులో బాధ్యులైన అధికారులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరారు.

స్థానిక ఎన్నికల సమయంలో జిల్లా ఎస్పీ తప్పు చేసిన అధికారులను కాపాడుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంలో ఎస్సీ కమిషన్ ప్రత్యేక బృందం హస్తక్షేపం చేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు.

అంతర్గత విచారణ పేరుతో ఘటనను దాచిపెట్టే ప్రయత్నాలు మళ్లీ దళితులపై అన్యాయం జరగకుండా చర్యలు కోరుతున్నామని మందకృష్ణ స్పష్టం చేశారు. రాజేష్ మరణంపై నిరసనలు, స్పందనలు కొనసాగుతున్న నేపథ్యంలో అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు