ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల కొరత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్ కానుండటంతో వైద్య రంగంలో ఈ సంక్షోభం తలెత్తనున్నట్లు ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో వైద్య సిబ్బంది సంఖ్య 52% పెరిగి, ప్రతి పదివేల మందికి 67.9 శాతానికి చేరుకున్నట్లు డేటా చెబుతోంది. అయితే, ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రస్తుత వైద్యులలో దాదాపు 25% మంది 55 ఏళ్లు పైబడిన వారేనని WHO స్పష్టం చేసింది.
కత్తితో పొడిచి యువకుడి హత్య.. పరారీలో నిందితుడు
ఈ వృద్ధాప్య రిటైర్మెంట్ల కారణంగా 2030 నాటికి వైద్య సిబ్బంది కొరత ఏకంగా 11.1 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేవలం అంతర్జాతీయంగానే కాకుండా, మన దేశంలోనూ (IND) గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్రమైన వైద్యుల కొరత కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలో లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూత: విద్యారంగ సంక్షోభంపై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు!
