Homeజాతీయందేశంలో లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూత: విద్యారంగ సంక్షోభంపై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు!

దేశంలో లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూత: విద్యారంగ సంక్షోభంపై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు!

దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతపడ్డాయని ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇందులో కేవలం రెండు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ (MP), ఉత్తరప్రదేశ్ (UP) లలోనే ఏకంగా 55 శాతం పాఠశాలలు మూతపడటం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. పాఠశాలలతో పాటు విద్యార్థులకు వసతి కల్పించే హాస్టళ్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ప్రస్తుతం ఉన్న నిరుత్సాహకర వాతావరణంలో వంద మంది విద్యార్థులకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 14 మందికి మాత్రమే హాస్టల్ సీట్లు దొరుకుతున్నాయని, దీనివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏఐ పేరు మార్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర పోల్: నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు!

ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీల్లో నెలకొన్న దుస్థితి, నిత్యం వెలుగుచూస్తున్న పేపర్ లీకులు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి కీలక అంశాలపై విద్యార్థి లోకం గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు ఏదీ ప్రశ్నించకూడదని, అన్నీ మూసుకుని కూర్చోవాలని కోరుకునే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి యువత, విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

బిట్రగుంటలో అక్రమ మద్యం విక్రయాలు.. 30 బాటిళ్లు స్వాధీనం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు