విశాఖలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూర్మన్నపాలెం డిపో సమీపంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read: సైడ్ మిర్రర్కు బైక్ తగిలిందన్న కోపంతో యాక్సిడెంట్ చేశాడు
