కాకినాడ జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు మండలం టీ. రాయవరం పరిధిలోని ఓ చేపల చెరువు యజమాని గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో మృతి చెందినట్లు సమాచారం. టీ. రాయవరం–ఏలూరు మధ్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
చెరువు యజమాని హత్యకు గురైన విషయం తెలియడంతో ప్రత్తిపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతుడిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే విషయంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన నిందితుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. హత్యకు దారితీసిన కారణాలు కూడా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
also read: రేవారిలో దారుణ హత్య.. భార్యతో సంబంధం ఉందన్న అనుమానంతో స్నేహితుడి ఘాతుకం
