క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు టీమ్ ఇండియా ఓపెనింగ్ కాంబినేషన్ పై క్రికెట్ వర్గాల్లో సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది. తుది జట్టులో ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై బిసిసిఐ (BCCI) టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయానికి రాలేకపోతోంది.
ముగ్గురు స్టార్ల మధ్య తీవ్ర పోటీ:- ప్రస్తుతం జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ మరియు వైభవ్ రూపంలో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. మూడో స్థానం నుంచి దిగువ వరకు మిడిలార్డర్ బలంగా ఉన్నప్పటికీ, పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబట్టేందుకు ఏ జోడీని బరిలోకి దింపాలనే అంశంపై అయోమయం నెలకొంది. ముగ్గురిలోనూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లకు ఇది సవాలుగా మారింది.ఈ ఓపెనింగ్ సస్పెన్స్పై మాజీ క్రికెటర్, ప్రసిద్ధ వ్యాఖ్యాత దీప్ దాస్గుప్తా స్పందించారు. ఈసారి ఎలాంటి సందేహం లేకుండా సంజూ శాంసన్ – వైభవ్ జోడీని ఓపెనర్లుగా పంపాలని ఆయన టీమ్ యాజమాన్యానికి సూచించారు. “ఇప్పటివరకు మనం అభిషేక్ – వైభవ్, అలాగే అభిషేక్ – సంజూ కాంబినేషన్లు ఇన్నింగ్స్ ప్రారంభించడం చూశాం. కాబట్టి ఈసారి సంజూ, వైభవ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది” అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఉత్కంఠలో అభిమానులు:సంజూ అనుభవం, అభిషేక్ అగ్రెసివ్ షాటింగ్, వైభవ్ అటాకింగ్ గేమ్ ప్లాన్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వేగంగా పరుగులు సాధించగల ఈ ముగ్గురిలో మేనేజ్మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందో, అఫ్గాన్తో మ్యాచ్లో ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి.
ఛారిటీల పేరిట ఆన్లైన్ దందా.. నకిలీ సంస్థలపై చర్యలకు ప్రజా డిమాండ్!
పోలవరంతో తెలంగాణ గ్రామాలకు ముప్పు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆందోళన!
