నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమై.. అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు.
నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించినట్లు సోనూసూద్ వెల్లడించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి తీవ్రంగా చలించిపోయినట్లు తెలిపారు. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు.. వారు తిరిగి సాధారణ జీవితం ప్రారంభించేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.
బాధితుల పునరావాసానికి కూడా సహాయం చేస్తానని సోనూసూద్ హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి.. వారి జీవితాల్లో మళ్లీ ఆశలు నింపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. విపత్తు సమయంలో బాధితులకు తోడుగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటనకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
also read: సంక్షోభ వేళ భారత్ అండ మరవలేనిది.. నేపాల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
