హైదరాబాద్, క్రైమ్మిర్రర్: చదువు సరిగ్గా రావడం లేదని 16ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లీఖార్జున్ ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీసు స్టషన్ పరిధిలోని సుభాష్చంద్రబోస్ నగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ ప్రాంతంలోఓ ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.
Also Read: వట్టేపల్లిలో ఎంఐఎం కార్యకర్త దారుణ హత్య…!
మల్లికార్జున్ తండ్రి పెయింటింగ్ పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:దారుణ ఘటన…మానసిక దివ్యాంగురాలిని వైర్లతో బందించి లైంగిక దాడి…
