తెలంగాణకు చెందిన ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే ఆయనకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, డీప్ఫేక్ వీడియోలను బయటకు విడుదల చేస్తామని నిందితులు ఫోన్లో హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కుటుంబ పరువుకు, రాజకీయ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తామని బెదిరించినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్, డబ్బుల డిమాండ్ గురించి పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై దృష్టి సారించారు. ఫోన్ నంబర్లు, కాల్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
డీప్ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: UP Crime: విద్యార్థిపై టీచర్ దాష్టీకం.. 39 సెకన్లలో 17 చెంపదెబ్బలు!
