ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఒక న్యాయమూర్తి ఇచ్చిన వరుస తీర్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్.. గత నాలుగు నెలల్లో 10 వేర్వేరు కేసుల్లో 22 మంది దోషులకు మరణశిక్ష విధించారు.
న్యాయవాది హత్య, కిడ్నాప్, దోపిడీ తదితర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ అనంతరం నిందితులు దోషులుగా తేలడంతో కోర్టు ఈ కఠిన శిక్షలను విధించింది.
బరేలీలోనూ కీలక తీర్పులు
రవి కుమార్ దివాకర్ గతంలో బరేలీలో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో కూడా పలు తీవ్రమైన నేరాల కేసుల్లో తీర్పులు వెలువరించి 13 మందికి మరణశిక్ష విధించారు. తాజాగా ముజఫర్నగర్లో 22 మందికి మరణశిక్ష విధించడంతో ఆయన కెరీర్లో ఇప్పటివరకు మరణశిక్షలు ఎదుర్కొంటున్న దోషుల సంఖ్య 35కి చేరింది.
అయితే.. మరణశిక్ష వెంటనే అమలు కాదు
సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్ష తుది నిర్ణయం కాదు. చట్టపరంగా ఇలాంటి శిక్ష అమలుకు సంబంధిత హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి. అంటే సెషన్స్ కోర్టు తీర్పు తర్వాత కేసు హైకోర్టు పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాతే మరణశిక్ష అమలుకు అవకాశం ఉంటుంది.
తీవ్రమైన నేరాలకు సంబంధించి వరుసగా ఇలాంటి కఠిన తీర్పులు వెలువడటం ప్రస్తుతం న్యాయవర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
also read: ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఎవరు? మోదీ వ్యాఖ్యలపై రిజిజు వివరణ.. మూడు వర్గాలు ఇవే!
