టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో సినిమా రూపొందిందని తెలిపారు. కథ, వినోదం కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ.. ‘పాంచాలి పంచభర్తృక’పై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేంత నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల, అనిల్ రావిపూడి చిత్రాల్లో కనిపించేలా వినోదాత్మక అంశాలతో సినిమాను రూపొందించినట్లు తెలిపారు.
ఈ చిత్రంలో 50 మందికి పైగా నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించేలా కథను తెరకెక్కించినట్లు చెప్పారు.
ప్రీ రిలీజ్ వేడుకలో నటులు పృథ్వీ, శ్రీనివాస్, బాల, సునీతతో పాటు చిత్రబృందానికి చెందిన పలువురు పాల్గొన్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది.
also read: బషర్ అల్ అసద్కు మరణశిక్ష.. సిరియా మాజీ అధ్యక్షుడిపై కోర్టు సంచలన తీర్పు
