డిజిటల్ ఫైనాన్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎంపాకెట్ ప్లాట్ఫామ్, యువతను ఆకర్షించే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టిని తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘నాన్-స్టాప్ గ్రోత్’ పేరుతో కొత్త క్యాంపెయిన్ను కూడా ప్రారంభించింది.
ఈ క్యాంపెయిన్ ద్వారా యువతలో ఆర్థిక అవగాహన పెంచడం, సులభమైన డిజిటల్ లోన్ సేవలను చేరువ చేయడం సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా ఎదురయ్యే ఆర్థిక అవసరాలను వేగంగా తీర్చేందుకు రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులకు సేవలు అందించినట్లు సంస్థ వెల్లడించింది.
నవీన్ పోలిశెట్టి ప్రయాణం… సాధారణ స్థాయి నుంచి ఎదిగి విజయాన్ని సాధించిన ఆయన కథ , ఈ క్యాంపెయిన్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. యువతలో ధైర్యం, పట్టుదల పెంచే సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఎంపాకెట్ ముందుకొచ్చింది.
సంస్థ ప్రతినిధుల ప్రకారం, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటికే 65 లక్షలకు పైగా వినియోగదారులు ప్రయోజనం పొందారు. భవిష్యత్తులో మరింత మందికి సులభంగా డిజిటల్ ఆర్థిక సేవలను అందించడంపై దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు.
యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతమైన సేవలు, పారదర్శక విధానాలతో ఎంపాకెట్ ముందుకు సాగుతోంది. ‘నాన్-స్టాప్ గ్రోత్’ క్యాంపెయిన్ ఈ దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
also read: రణబీర్ ‘రామాయణం’పై భారీ హైప్… ట్రైలర్కు ప్రశంసలు, కానీ వ్యూస్పై చర్చ!
