హైదరాబాద్, క్రైమ్మిర్రర్: తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
Also Read:మలబద్ధకం ఎందుకు వస్తుంది?.. కారణాలు ఇవే!
ఆయన మరణం బీఆర్ఎస్కే కాకుండా తెలంగాణ సమాజానికీ తీరని లోటని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి కార్యకర్తలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. “జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా” అంటూ కేటీఆర్ నివాళులర్పించారు.
Also Read:భారీ వర్షాలతో ఊపందుకున్న వ్యవసాయ పనులు.. ఆనందంలో అన్నదాతలు!
