Homeవైరల్Train Viral Video: ఏసీ బోగీలో దీపం వెలిగించి పూజలు చేసిన ప్రయాణికుడు.. భద్రతపై ఆందోళన

Train Viral Video: ఏసీ బోగీలో దీపం వెలిగించి పూజలు చేసిన ప్రయాణికుడు.. భద్రతపై ఆందోళన

రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే తాజాగా ఓ రైలు బోగీలో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. కదులుతున్న రైలులోని ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజా కార్యక్రమాలు నిర్వహించడం కలకలం రేపింది.

వైరల్‌గా మారిన వీడియోలో ఓ వ్యక్తి బనియన్, ధోతీ ధరించి అప్పర్ బెర్త్‌పై కూర్చొని పూజ చేస్తున్నట్లు కనిపించింది. అతను నూనె ప్రమిదలో దీపం వెలిగించడంతో పాటు ధూపం కూడా వేసినట్లు వీడియోలో కనిపించింది. రైలు ప్రయాణ సమయంలో ఇలా మంటలు ఉపయోగించడం ప్రమాదకరమని తోటి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఘటనను వీడియో తీస్తున్న ఓ ప్రయాణికుడు దీనిపై ప్రశ్నించినప్పటికీ, సదరు వ్యక్తి స్పందించకుండా తన పూజను కొనసాగించినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రైలులో అగ్ని ప్రమాదాలకు దారితీసే వస్తువులను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఈ ఘటనపై రైల్వే అధికారులు వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులందరూ భద్రతా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

also read: Assam Floods: వరదల్లో 68 మంది మృతి.. బురదలో బయటపడుతున్న విషాద దృశ్యాలు వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు