జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనకు ప్రతిస్పందనగా భద్రతా బలగాలు దృఢ చర్యలకు దిగాయి. పోలీసు హెడ్ కానిస్టేబుల్పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి అనుమానిత ఉగ్రవాదులపై చర్యలు వేగవంతం చేశారు.
సమాచారం ప్రకారం, ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించిన ఇద్దరు ఉగ్రవాదులకు చెందిన నివాసాలను అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఇళ్లను కూల్చివేయడం ద్వారా గట్టి సందేశం ఇచ్చారు. ఇందులో ఒకరు ఇటీవలే నిర్మించిన కొత్త ఇంటిని కూడా బలగాలు ధ్వంసం చేశాయి.
ఈ చర్యల అనంతరం అనంత్నాగ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి, ప్రతి అనుమానాస్పద కదలికపై నిఘా పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
also read: డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన…! సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య…