క్రైమ్ మిర్రర్, జాతీయం:- CJP చేపట్టిన నిరసన కు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇలా వేర్వేరు నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత నేరుగా రంగంలోకి దిగడంతో, దేశవ్యాప్తంగా గ్రామీణ , పట్టణ ప్రాంతాలపై ఈ నిరసనల ప్రభావం పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.అయితే, వేర్వేరు ఎజెండాలతో, ఉమ్మడి ప్రకటన (జాయింట్ డిక్లరేషన్) లేకుండా ముందుకు వెళ్తే, ప్రజలు దీనిని రాజకీయ కోణంలో చూసి దారిమళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎంట్రీ CJPకి అంతిమంగా లాభిస్తుందా లేదా నష్టం చేకూరుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.
నేడు జింబాబ్వేతో తొలి T20.. శ్రేయస్ ఖాతా తెరిచేనా?
విస్తరిస్తున్న కరోనా.. 32కి చేరిన కేసులు!