క్రైమ్ మిర్రర్ : తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాబోయే 24 నుంచి 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ వ్యాప్తంగా పెరగనున్న వర్షాల ప్రభావం
రుతుపవనాల కదలికలు వేగవంతం కావడంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వాగులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని తెలిపారు.