మాదాపూర్ క్రైమ్ మిర్రర్ : మాదాపూర్ డివిజన్ చందనాయక్ తాండ లో, సురేష్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరం, అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ , ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపెటి జైపాల్ , యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్ , టి ఆర్ సి ఓ ఆర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మరియు శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను స్మరించుకుంటూనే, నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలను ప్రశంసించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో సురేష్ నాయక్ పనితీరును అనుసరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య శిబిరం, అన్నదానం మరియు ఉచిత మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి, తన సోదరుడి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న నాగేశ్ ను అభినందించారు.